ఆంధ్రప్రదేశ్

andhra pradesh

త్వరలోనే వెండితెరపైకి ఆళ్ల సోదరుల దోపిడి: మాజీ మంత్రి జవహర్

By

Published : Mar 27, 2021, 12:34 AM IST

ఆళ్ల సోదరులపై మాజీ మంత్రి జవహర్ తీవ్ర విమర్శలు చేశారు. వారి దోపిడీ త్వరలోనే వెండితెరపైకి రానుందన్నారు. ఆళ్ల కంపెనీ చేస్తున్న వేల కోట్ల దోపిడీ త్వరలోనే దేశ వ్యాప్తంగా సంచలనం కానుందని ట్వీట్ చేశారు.

former minister jawahar tweet on alla brothers
మాజీమంత్రి జవహర్

ఆళ్ల సోదరుల దోపిడీ త్వరలోనే వెండితెరపైకి రానుందని మాజీమంత్రి జవహర్ పేర్కొన్నారు. ఇసుక దోపిడీతో పాటు వివిధ రాష్ట్రాల్లో చెత్త పేరుతో ఆళ్ల కంపెనీ చేస్తున్న వేల కోట్ల దోపిడీ త్వరలోనే దేశ వ్యాప్తంగా సంచలనం కానుందని ట్వీట్ చేశారు.

"కరకట్ట కమల్ మీడియా సమావేశం కామెడీ సినిమాని తలపించింది. జగన్ రెడ్డి, ఆళ్ల రెడ్డి అడ్డంగా దొరికిపోయి... మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టు బుల్లితెరపై కనిపించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, అసైన్డ్ భూముల కథలు ప్రజలకు అర్థమైపోయాయి. ఇక జగన్ అండ్ కో కొత్త ఆవు కథ కోసం వెత్తుకోవటం మంచిది. కరకట్ట కమల్ అండ్ కంపెనీ ప్యాక్ అప్ చెప్పే రోజు అతి దగ్గర్లోనే ఉంది." -జవహర్, మాజీ మంత్రి

జగన్ ఎస్సీల పట్ల విషం కక్కుతున్నారు: పిల్లి మాణిక్యరావు

అమరావతిని రాజధానిగా సహించలేకే జగన్ ఎస్సీల పట్ల విషం కక్కుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని అడ్డం పెట్టుకొని వారిని అణగదొక్కేందుకే నందిగం సురేశ్​ను చెేరదీశారన్నారు. సురేశ్ ఎంపీ అయ్యాక.. ఎస్సీల హత్యలు, అత్యాచారాలు, శిరో ముండనాలు జరిగితే ఏనాడూ స్పందించలేదని ఆరోపించారు.

ఇదీ చదవండి

గవర్నర్​కు బడ్జెట్ ఆర్డినెన్స్‌.. ఆమోదం తర్వాత నోటిఫికేషన్

ABOUT THE AUTHOR

...view details