ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 4, 2020, 12:13 PM IST

ETV Bharat / city

రైతుల ఆందోళనకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి: దేవినేని ఉమా

కరెంటును ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే... మీటర్ల బిగింపంటున్న రైతుల ఆందోళనకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

former minister devineni uma
మాజీమంత్రి దేవినేని ఉమా

ప్రతి వ్యవసాయ పంపుసెట్టుకు మీటర్ బిగింపు, ఒక్కోడివిజన్ ఒక్కోప్రైవేటు సంస్థకు అప్పగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. బిల్లుల వసూలు బాధ్యత వారిదేనన్న ఆయన ప్రైవేటుపరం అయితే కొత్త తలనొప్పులు, సబ్సిడీలు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారని తెలిపారు. కరెంటును ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే మీటర్ల బిగింపని రైతుల ఆందోళనకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details