ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 6, 2022, 4:45 PM IST

ETV Bharat / city

మావోయిస్టు దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గింది : డీజీపీ రాజేంద్ర నాథ్

DGP: రాష్ట్రంలో మావోయిస్ట్​ల దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని.. ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు.

DGP on maoists
రాష్ట్రంలో మావోయిస్ట్​ల దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గింది

DGP: రాష్ట్రంలో మావోయిస్ట్​ దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. జన జీవన స్రవంతిలోకి వచ్చే వారికి పరిహారం అందిస్తామన్నారు. జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని భాస్కర్, మోహన్, వంతల కృష్ణా, కిల్లో రాజు, మరొక మావోయిస్టు లొంగిపోయారని వెల్లడించారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్​శాఖ అండగా ఉంటుందని.. మావోయిస్టులపై ఉన్న రివార్డ్​ను వారికే అందజేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురిపై లక్ష రూపాయల రివార్డ్ ఉందన్నారు. గాలికొండ ,పేద బయలు, కోరుకొండ ఏరియాలో ఇంకా మావోయిస్టు కమిటీలు ఉన్నాయని.. గతంలో కంటే ప్రస్తుతం వారి ప్రభావం తగ్గిందన్నారు. ఏజెన్సీలో కూంబింగ్ నిరంతరం కొనసాగుతుందని.. వీరిపై నిఘా ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందటంతో మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details