ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 21, 2020, 3:36 PM IST

ETV Bharat / city

మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసన

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహరావు కళ్లకు గంతలు కట్టుకుని... విజయవాడలో ఆంధ్ర రత్న భవన్ వద్ద ఏఐసీసీ సభ్యులు నిరసనకు దిగారు. ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.

Congress protests against three agricultural bills
మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ...కాంగ్రెస్ నిరసన

రాజ్యసభలో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ...దేశంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహరావు అన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని విజయవాడలో ఆంధ్ర రత్న భవన్ వద్ద ఏఐసీసీ సభ్యులు నిరసనకు దిగారు. వ్యవసాయ బిల్లుల విషయంలో భాజపాకు బలం లేకపోయినా...సభలో వాటిని ప్రవేశ పెట్టి మూజువాణి ఓటుతో ఆమోదింప చేసుకున్నారని నరహరశెట్టి నరసింహరావు అన్నారు. భాజపా దయాదాక్షిణ్యాలతో బెయిల్​పై బయట ఉన్న విజయసాయి రెడ్డికి కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని దళారి పార్టీ అంటే...కాంగ్రెస్ పార్టీలో పుట్టి...కాంగ్రెస్ సీఎంగా మరణించిన వైఎస్​ఆర్​ని అవమానించినట్టే అని ఏఐసీసీ కార్యదర్శి రాజీవ్ రతన్ అన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్న వైకాపా పార్టీ.. విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఆమోదించిన వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.

ఇదీ చదవండి:

'ఎస్సీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.. డీజీపీ గారూ సమీక్షించండి'

ABOUT THE AUTHOR

...view details