ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 30, 2021, 2:19 PM IST

ETV Bharat / city

CM JAGAN : 'భారత క్రీడాచరిత్రలో ఈ విజయం మైలురాయిగా నిలుస్తుంది'

పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అవని లేఖారాతో పాటు, పతకాలు సాధించిన వారందరికీ సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. భారత క్రీడాచరిత్రలో ఈ విజయం మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు.

సీఎం జగన్‌
సీఎం జగన్‌

టోక్యో పారాలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించిన అవని లేఖారా, పతకాలు సాధించిన ఇతర క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి అభినందనలు తెలిపారు. అత్యున్నత స్థాయి ప్రతిభ కనపరిచి, సాధించిన విజయం భారత క్రీడాచరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని సీఎం కొనియాడారు. ఇప్పటి వరకు ఏడు పతకాలను సొంతం చేసుకున్న భారత్ మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

సీఎం జగన్‌

ABOUT THE AUTHOR

...view details