ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 14, 2019, 9:40 AM IST

Updated : Nov 14, 2019, 10:10 AM IST

ETV Bharat / city

రాజ్​భవన్​లో ఘనంగా బాలల దినోత్సవం

బాలల దినోత్సవాన్ని రాజ్​భవన్​లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాజ్​భవన్​లో ఘనంగా బాలల దినోత్సవం

రాజ్​భవన్​లో బాలల దినోత్సవం

రాజ్​భవన్​లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఎంతోకాలం దేశానికి ప్రధానిగా సేవలందించిన నెహ్రూ దార్శనికత అందరికీ ఆదర్శమని గవర్నర్​ కొనియాడారు. నెహ్రూ జీవితం బావి తరాలకు మార్గదర్శకంగా నిలిచిందని ​ప్రశంసించారు. భవిష్యత్తులో మనదేశం ఒక గొప్ప శక్తిగా ఎదుగుతుందని అన్నారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడే విజయం సాధించగలరని సూచించారు.

Last Updated : Nov 14, 2019, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details