ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 15, 2021, 7:36 AM IST

ETV Bharat / city

cbn: కుప్పంలో దొంగలను అడ్డుకోండి : చంద్రబాబు

కుప్పం ఎన్నికల్లో దొంగ ఓట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తగా పనిచేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు(cbn) దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల్లో అక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

కుప్పం మునిసిపాలిటీకి జరిగే ఎన్నికల్లో దొంగ ఓట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తగా పనిచేయాలని తెదేపా అధినేత చంద్రబాబు.. స్థానిక తెలుగుదేశం నేతలకు దిశానిర్దేశం చేశారు. నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఎన్నికల్లో అక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. దొంగ ఓట్లు, అక్రమాలు ఎక్కడ చోటుచేసుకున్నా వెంటనే ఆధారాలు సేకరించి ఎప్పటికప్పుడు వీడియోలు బయటపెట్టాలని సూచించారు.

పోలింగ్ ప్రశాంతంగా, ప్రజాస్వామ్య పద్దతిలో జరిగేలా శ్రేణులు పని చేయాలని చెప్పారు. తాను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని, ప్రతి సంఘటనా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. పరిస్థితులను బట్టి వెంటనే క్షేత్రస్థాయికి వస్తానని బాబు తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదు: సీఎం జగన్‌

ABOUT THE AUTHOR

...view details