ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 10, 2022, 11:26 AM IST

ETV Bharat / city

CBN HONOR: మండువవారిపాలెం గ్రామస్తులని సన్మానించిన చంద్రబాబు.. !

CBN HONOR: మహానాడు నిర్వహణకు 140ఎకరాల భూమి ఇచ్చిన 40మంది మండువవారిపాలెం రైతుల్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్​లో సన్మానించారు. వచ్చిన వారికి శాలువాలు కప్పి సత్కరించారు.

CBN HONOR
మండువవారిపాలెం గ్రామస్తులని సన్మానించిన చంద్రబాబు

మండువవారిపాలెం గ్రామస్తులని సన్మానించిన చంద్రబాబు

CBN HONOR: ప్రకాశం జిల్లా మండువవారిపాలెం గ్రామస్తుల్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్​లో సన్మానించారు. మహానాడు నిర్వహణకు 140ఎకరాల భూమి ఇచ్చిన 40మంది రైతుల్ని పార్టీ కార్యాలయానికి ఆహ్వానించి శాలువాలు కప్పి సత్కరించారు. మహానాడు నిర్వహణకు భూమి ఇచ్చినందుకు గర్వంగా ఉందని మండువవారిపాలెం గ్రామస్తులు అన్నారు. మహానాడు నిర్వహణతో తమ ఊరి పేరు దేశ, విదేశాల్లో మార్మోగిందన్నారు. మహానాడు తర్వాత మా పొలాలు మళ్లీ శుభ్రపరచి, సర్వే చేయించి మరీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎవరికీ భయపడకుండా స్వచ్ఛందంగా తమ పొలాలు మహానాడు నిర్వహణకు ఇచ్చామని వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details