ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Happy Dussehra : దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు - చంద్రబాబు, లోకేశ్

దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ మార్గాన్ని నమ్ముకున్న వారు ఏది సంకల్పించినా దుర్గామాత అనుగ్రహం ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఇంటిల్లిపాదికీ శాంతి సౌభాగ్యాలు, సకల విజయాలూ సమకూరాలని లోకేష్ ఆకాంక్షించారు.

By

Published : Oct 15, 2021, 11:17 AM IST

Happy Dussehra
దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు -చంద్రబాబు, లోకేశ్

దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లవేళలా ధర్మ మార్గాన్ని నమ్ముకున్న వ్యక్తి ఏది సంకల్పించినా విజయం సాధించేలా ఆ దుర్గామాత అనుక్షణం తోడుగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. దసరా పండుగ అందరికీ సకల శుభాలను, సుఖ సంతోషాలను చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు.

అందరూ శాంతి, సౌభ్రాతృత్వంతో కలిసి, మెలిసి ఉండాలంటే మనం మంచిగా ఉంటే సరిపోదని.. చెడును ప్రతిఘటించి పోరాడాలని లోకేష్ సూచించారు. దుష్టులపై విజయం సాధించినప్పుడే అందరికీ సుఖశాంతులు సమకూరుతాయని అన్నారు. దేవీ అనుగ్రహంతో ఇంటిల్లిపాదికీ సకల విజయాలు సమకూరాలని లోకేష్ అభిలాషించారు.

ఇదీ చదవండి : KRMB: జల విద్యుత్ కేంద్రాలను అప్పగించిన ఆంధ్రప్రదేశ్.. కానీ

ABOUT THE AUTHOR

...view details