ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బెదిరింపుల వల్లే వైకాపాలోకి అలీ'

''నేతల వ్యక్తిగత స్వేచ్ఛను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరిస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబును కలుస్తానని అలీ నాకు ఫోన్ చేసి చెప్పారు. చివరికి కేసీఆర్​ బెదిరింపులకు లొంగి లోటస్​పాండ్​కి వెళ్లారు. వైకాపాలో చేరారు''- బుద్ధా వెంకన్న

By

Published : Mar 11, 2019, 5:50 PM IST

బుద్ధా వెంకన్న విమర్శలు

మీడియా సమావేశంలో బుద్దా వెంకన్న
రాష్ట్ర సార్వత్రికఎన్నికల సమరంలోచంద్రబాబు, కేసీఆర్​ మధ్యే పోటీ ఉంటుందని ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న అన్నారు. వైకాపా అధినేత యుద్ధం నుంచి తప్పుకొన్నారని ఎద్దేవా చేశారు. జగన్​ కుర్చీకి మాత్రమే పరిమితమైతే... వైకాపా వ్యవహారాలన్నింటినీకేటీఆర్ నడిపిస్తున్నారని విజయవాడ తెదేపా కార్యాలయంలో ఆరోపించారు. తెదేపాలోకి చేరుతానన్న అలీ... కేసీఆర్ బెదిరింపులకు లొంగి ప్రతిపక్ష పార్టీలోకి చేరారన్నారు. తెలంగాణ దొరల కాళ్ల దగ్గర వైకాపాను పెట్టిన జగన్... రాష్ట్రంలో తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్రపన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీపీ (కుట్రల కాంగ్రెస్ పార్టీ)గా వైసీపీ మారిందని విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details