ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రమంత్రిని కలిసిన విజయసాయిరెడ్డి, అవంతి

కేంద్రమంత్రి ప్రహ్లాద్​సింగ్ పటేల్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్రమంత్రితో చర్చించారు.

By

Published : Aug 14, 2019, 7:29 PM IST

avanthi_and_vijayasai reddy_meets_central_minister

పర్యాటక అభివృద్ధిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్​ సింగ్​ను మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. ప్రసాదం, స్వదేశీ దర్శన్​ కింద రూ.900 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్ర మంతిని కోరినట్లు అవంతి తెలిపారు. త్వరలో అమరావతి లేదా విశాఖలో.. పర్యాటక రంగంలో పెట్టుబడులపై సదస్సు ఉంటుందని వెల్లడించారు. గత ప్రభుత్వం పట్టించుకోని కారణంగా రాష్ట్రానికి పథకాల కింద నిధులు రాలేదని విమర్శించారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరగా...కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి అవంతి తెలిపారు. ఆలయాల కోసం ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details