బీసీలకు ఇచ్చిన హామీలు అమల్చేయాలి... లేకుంటే....
పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారని ఏపీబీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తి అన్నారు. చట్టసభల్లో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు.
వైకాపా అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రలో బీసీల హామీలు అమలు చేస్తామని మాట ఇచ్చారని ఏపీ వెనుకబడిన తరగతుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తి తెలిపారు. బీసీలకు ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం అమలు చేయాలని లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని ముందస్తుగా హెచ్చరించారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి తీర్మానం చేశామన్నారు. నామినేటెడ్ పోస్టులలో బీసీలకు దామాషా ప్రకారం పోస్టులు ఇవ్వాలని కోరారు. అలాగే బీసీలకు చట్టసభల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.