ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి సజ్జల.. మంత్రివర్గ విస్తరణపై చర్చ

By

Published : Apr 10, 2022, 3:58 PM IST

Updated : Apr 10, 2022, 4:35 PM IST

మంత్రివర్గ విస్తరణపై చర్చ
మంత్రివర్గ విస్తరణపై చర్చ

15:55 April 10

బాలినేని శ్రీనివాసరెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ

బాలినేని శ్రీనివాసరెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. విజయవాడ బందరు రోడ్డులోని బాలినేని నివాసానికి వెళ్లిన సజ్జల మంత్రివర్గ విస్తరణ అంశాలపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్​ను మంత్రివర్గంలో కొనసాగించి, తనను తొలగిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో సజ్జల స్వయంగా బాలినేని ఇంటికి వచ్చి చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బాలినేని అనుచరులు, మద్దతుదారులు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. బాలినేనిని మంత్రివర్గంలో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మంత్రి పదవి ఆశిస్తున్న వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్‌ స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేరు. పల్నాడుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మాచర్లలో సమావేశమై పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. బాలినేనితో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో తానే సీనియర్‌నని, మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని తెలిపారు.

ఇదీ చదవండి: మంత్రివర్గంపై కసరత్తు తుది దశకు.. సాయంత్రం గవర్నర్​కు జాబితా

Last Updated : Apr 10, 2022, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details