ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2020, 12:31 PM IST

Updated : Jun 25, 2020, 12:56 PM IST

ETV Bharat / city

కొనసాగుతున్న వైరస్ ఉద్ధృతి: రాష్ట్రంలో కొత్తగా 553 కరోనా కేసులు నమోదు

553 new corona cases registered in andhrapradesh
553 new corona cases registered in andhrapradesh

12:28 June 25

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా ఉద్ధృతి పెరుగుతుంది. కొత్తగా 553 కరోనా కేసులు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 10,884కు చేరింది. గడచిన 24 గంటల్లో.. స్థానికంగా ఉంటున్న 477 మందికి కరోనా సోకగా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి కరోనా పాజిటివ్​గా తేలింది.

వైరస్ కారణంగా కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. మెుత్తం మృతుల సంఖ్య 136కు చేరింది. 24 గంటల వ్యవధిలో 19 వేల 85 మందికి కరోనా పరీక్షలు చేశారు. గుంటూరు జిల్లా-67, తూర్పు గోదావరి-64, కర్నూలు-72, అనంతపురం-52 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 5 వేల 760 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Last Updated : Jun 25, 2020, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details