తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముజాహిద్నగర్లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు.. పదేళ్ల రియాజ్, ఐదేళ్ల మహ్మద్ కారులో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. నిన్న మధ్యాహ్నం నుంచి వీరిద్దరూ కనిపించకపోవడం వల్ల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో కారు వెనుక సీటులో పిల్లలిద్దరూ విగతజీవులుగా కనిపించారు. వారిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు కావడం వల్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చిన్నారుల మృతిపై పలు అనుమానాలు...