ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 13, 2020, 12:21 PM IST

ETV Bharat / city

దానం చేయండి.. అంటూ వస్తారు.. అందినవి దోచేస్తారు..

తిరుపతి నగరంలో సరికొత్త దొంగతనాలు వెలుగుచూస్తున్నాయి. కొందరు మహిళలు దానం చేయాలంటూ గుంపులుగా దుకాణాల్లోకి వచ్చి అందినవి దోచేస్తున్నారు. మహిళలు దుకాణాల్లోకి వెళ్లి చోరీలు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

women-thieves-in-tirupathi
తిరుపతి దుకాణాల్లో చోరీలు చేస్తున్న మహిళలు

తిరుపతి దుకాణాల్లో చోరీలు చేస్తున్న మహిళలు

తిరుపతి నగరంలో మహిళలు సరికొత్త రీతిలో దొంగతనాలు చేస్తున్నారు. దానం చేయాలంటూ దుకాణాల్లోకి వెళ్లి చోరీలు చేస్తున్నారు. చిన్నపిల్లలతోనూ దొంగతనం చేయిస్తున్నారు. తిరుపతి లీలామహల్ కూడలిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్టీల్ దుకాణంలో ఇలా దొంగతనం చేశారు. అక్కడి సీసీ కెమెరాలో మహిళల చోరీ దృశ్యాలు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details