ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 17, 2021, 2:24 PM IST

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాజ్యసభ సభ్యుడు షంషర్ సింగ్ దుల్లో, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పాటిల్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజేయ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఉద్యోగులందరికీ మేలు జరగాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details