ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 26, 2021, 2:22 PM IST

Updated : Jan 26, 2021, 9:34 PM IST

ETV Bharat / city

తిరుపతిలో ఘనంగా గణతంత్ర వేడుకలు

తిరుమల శ్రీ వారి దర్శనం కోసం వచ్చే భక్తుల సేవే ప్రథమ ప్రాధాన్యంగా తితిదే కృషి చేస్తోందని ఈవో జవహర్ రెడ్డి అన్నారు. తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.

republic day
తిరుపతిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

తిరుమల శ్రీ వారి దర్శనం కోసం వచ్చే భక్తుల సేవే ప్రథమ ప్రాధాన్యంగా తితిదే కృషి చేస్తోందని ఈవో జవహర్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.

విజిలెన్స్ దళాల నుంచి ఈవో గౌరవ వందనాన్ని స్వీకరించారు. అదనపు ఈవో ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో బసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధర్మప్రచారంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఈవో తెలిపారు.

'సుప్రీంతీర్పు చెంపపెట్టు లాంటిది'

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లిలో తేదేపా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ బాధ్యులు రమేష్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూజలు చేసి పాలాభిషేకం చేశారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని నాయకులన్నారు.

ఇదీ చదవండి:పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌పై ఎస్‌ఈసీ చర్యలు

Last Updated : Jan 26, 2021, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details