శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ఎన్ఆర్ఐ భారీ విరాళం
తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ఓ ప్రవాస భారతీయుడు భారీ విరాళం అందజేశారు.
nri_1_crore_donated_to_ttd
తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ఓ ప్రవాస భారతీయ భక్తుడు భూరి విరాళాన్ని అందజేశారు. ఎం.శ్రీనివాస్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ... కోటి 116 రూపాయలను విరాళంగా సమర్పించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వితరణకు సంబంధించిన డీడీలను తితిదే పాలకమండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డికి కుటుంబ సభ్యులతో కలసి అందజేశారు.