ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 24, 2021, 12:53 PM IST

ETV Bharat / city

తితిదే ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఈవో జవహర్​రెడ్డి ప్రమాణం

తితిదే ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఈవో జవహర్​రెడ్డి ప్రమాణం చేశారు. ఆలయంలోని రంగనాయకులు మండపంలో ఈవో జవహర్​రెడ్డితో అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు.

eo javahar reddy took oath as ttd ex officio member
eo javahar reddy took oath as ttd ex officio member

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఈవో జవహర్​రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈవో జవహర్​రెడ్డితో అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఈవోకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి ఏకాంతంగా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టిక్కెట్ల సంఖ్యలను పెంచు తుండడంతో భక్తుల ఆరోగ్యం దృష్ట్యా నిబంధనలను తీసుకువస్తున్నామని... తిరుమలకు వచ్చే భక్తులు కరోనా టీకా వేసుకున్న సర్టిఫికెట్‌ గానీ... తిరుమలకు వచ్చే 72 గంటల ముందు పరీక్ష చేయించుకున్న కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details