ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 3PM

.

By

Published : Oct 23, 2021, 3:00 PM IST

ప్రధాన వార్తలు @ 3PM
ప్రధాన వార్తలు @ 3PM

  • NTR BHAVAN: ఎన్టీఆర్ భవన్ పై దాడి ఘటనలో నిందితుల అరెస్టు.. ఎంత మంది అంటే?

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మీడియాలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా.. అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ARREST: పట్టాభి నివాసంపై దాడి కేసులో 11 మంది అరెస్టు

పట్టాభిరాం నివాసంపై జరిగిన దాడి ఘటనలో 11 మందిని అరెస్టు చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో విజయవాడ గుణదల, క్రీస్తురాజపురం, బావాజీపేట, ఉడ్‌పేట, సీతారామపురం వాసులున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Minister Kannababu: సీఎంపై బురద జల్లేందుకే చంద్రబాబు దిల్లీ పర్యటన: కన్నబాబు

తెదేపా చేపట్టిన 36 గంటల దీక్షలో.. పార్టీ నేతల చేత సీఎంను తిట్టించారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో తెదేపా అశాంతి సృష్టించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై బురద జల్లేందుకే చంద్రబాబు దిల్లీ పర్యటన అని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • OTS SCHEME: ఓటీఎస్​ పథకం.. లబ్ధిదారులపై ఒత్తిడి లేదంటున్న ప్రభుత్వం

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణం పొంది వివిధ గృహ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు వర్తింపజేస్తున్న ఓటీఎస్‌ పథకాన్ని స్వచ్ఛంద విధానంలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'గోవాలో డబుల్​ ఇంజన్​ వేగంతో అభివృద్ధి పరుగులు'

గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఆత్మనిర్భర భారత్ స్వయంపూర్ణ గోవా' అనే కార్యక్రమ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాలను గోవా ప్రభుత్వం నూటికి నూరు శాతం అమలు చేస్తోందని కితాబిచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చదువుకునేందుకు డబ్బులు లేకే చనిపోతున్నా..

పేదరికం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గొప్పగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలనుకుంది ఆ యువతి. తాను కన్న కలలను పేదరికం వెలివేయగా.. ఉరి వేసుకొని విగతజీవిగా మారింది. తన ఇబ్బందులను ఓ కాగితంపై పెట్టి ఇదే చివరి లేఖ.. ఇక సెలవు అని చెప్పి అనంతలోకాలకు వెళ్లిపోయింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'తైవాన్'​ రగడ- అమెరికాపై ఉత్తర కొరియా ఫైర్​

చైనాతో స్నేహబంధాన్ని మరోమారు చాటుకుంది ఉత్తర కొరియా (north korea china relations). తైవాన్​ వ్యవహారంలో చైనాకు మద్దతుగా నిలిచి, అమెరికాపై తీవ్రస్థాయిలో మండిపడింది(taiwan china news). అగ్రరాజ్యం తన నిర్లక్ష్యపూరిత వైఖరి కారణంగా చైనాతో ఉద్రిక్తతలకు తెరలేపిందని ఆరోపించింది(china us news). పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..

బంగారం ధర (Gold Rate Today) శనివారం స్థిరంగా ఉంది. మరోవైపు వెండి ధర (Silver price today) స్వల్పంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ganguly on kohli captaincy: కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం

టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై (virat kohli steps down as indian captain) తానూ ఆశ్చర్యానికి గురయ్యానని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. కోహ్లీ కెప్టెన్సీపై బీసీసీఐ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు చాలా కాలం కెప్టెన్​గా ఉండటం కష్టమని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Prabhas birthday: ప్రభాస్​కు అనుష్క స్పెషల్ విషెస్

హీరో ప్రభాస్​ బర్త్​డే(prabhas birthday) సందర్భంగా హీరోయిన్ అనుష్క(anushka shetty marriage) విషెస్ చెప్పింది. ఈ పోస్ట్​ను అభిమానులు ప్రస్తుతం, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details