ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM

ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Mar 24, 2021, 2:58 PM IST

3pm_Topnews
ప్రధాన వార్తలు @ 3pm

  • ఎన్నికల షెడ్యూల్ జారీ చేయలేం: ఎస్ఈసీ

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్‌ జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఇద్దరు నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

శాసన మండలిలో.. ఇద్దరు నూతన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ ఎంఏ. షరీఫ్... ఎమ్మెల్సీలు పోతుల సునీత, చల్లా భగీరథరెడ్డిలతో ప్రమాణ స్వీకారం చేయించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'వేగవంతం చేయాలి'

రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా విస్తృతి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం సమీక్షించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'దేశం దృష్టిని ఆకర్షించేలా'

దేశం దృష్టిని ఆకర్షించేలా తిరుపతి లోక్​సభ ఉపఎన్నిక ఫలితం ఉంటుందని తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి అన్నారు. ఉపఎన్నికపై తిరుపతిలో వైకాపా నేతలతో సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • '8-10 ఏళ్ల తర్వాతే '

వచ్చే 8-10 ఏళ్ల వరకు పెట్రోల్, డీజిల్​ను జీఎస్​టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేదని భాజపా ఎంపీ సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్​టీ విధిస్తే.. రూ. 2 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అభివృద్ధి పేరుతో మోసం'

ఐరాసలో శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై జరిగిన ఓటింగ్​లో భారత్​ దూరంగా ఉండటాన్ని తప్పుపట్టారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం. అభివృద్ధి పేరుతో తమిళ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • త్వరలో కీలక చర్చలు

అమెరికా- భారత్​ మధ్య దేశ భద్రతకు సంబంధించిన సమావేశం తిరిగి ప్రారంభం అవుతుందని బైడెన్​ ప్రభుత్వం తెలిపింది. అమెరికా హోంమంత్రి అలెజాన్​డ్రో మాయోర్కాస్​.. భారత రాయబారి తరణ్​​ జిత్​ సింగ్ సంధుతో భేటీ అయిన అనంతరం ఈమేరకు ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ధరలు, ఫీచర్లు ఇవే..

దేశీయ మార్కెట్లోకి ఓకేసారి మూడు స్మార్ట్​ఫోన్లను, తొలి స్మార్ట్​వాచ్​ను విడుదల చేసింది వన్​ప్లస్​. మూడు స్మార్ట్​ఫోన్లలో రెండు హై ఎండ్ ఫోన్లుగా, ఒక వేరియంట్​ను మిడ్​ రేంజ్​ సెగ్మెంట్లో తీసుకొచ్చింది. ఈ మూడు ఫోన్ల ప్రత్యేకతలు, ధరలు సహా స్మార్ట్​వాచ్​ విశేషాలు చూసేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఇంగ్లాండ్​కు ఎదురుదెబ్బ!

వన్డే సిరీస్​లో ఇంగ్లాండ్ జట్టు గాయాల సమస్య వేధిస్తోంది. కెప్టెన్​ మోర్గాన్​తో పాటు సామ్ బిల్లింగ్స్.. రెండో వన్డేలో ఆడేది సందేహంగానే కనిపిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సినిమా ముచ్చట్లు

మాస్​ మహరాజ్​ రవితేజ, దర్శకుడు రమేశ్​ వర్మ కాంబోలో రూపొందుతోన్న 'ఖిలాడి' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. మే 28న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. మార్చి నెలాఖరు కల్లా చిత్రీకరణ పూర్తి చేసుకోవాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details