ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భూకబ్జాకు గ్రామస్థుల పోటీ!

పట్టించుకునే వారు లేక అటవీ భూములు కబ్జాదారుల పాలైపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో నెల్లూరు జిల్లాలోని డెక్కలి మండల పరిధిలోని గ్రామస్థులు ఆక్రమణకు పాల్పడుతున్నారు.

By

Published : Feb 8, 2019, 6:52 AM IST

Updated : Feb 8, 2019, 8:16 AM IST

అటవీ భూములను పట్టించుకోని అటవీ అధికారులు

ఆక్రమణకు గురవుతున్న అటవీభూములను పట్టించుకునే వారు లేక కబ్జాదారుల పాలైపోతుంది. పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్న అటవీ అధికారుల తీరుతో వందల ఎకరాల్లో అటవీ భూమిని అక్రమించేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఏకంగా రెండు గ్రామాల ప్రజలే ఈ అటవీ భూమిని ఆక్రమించేందుకు పోటీ పడుతున్నారు.

అటవీ భూములను పట్టించుకోని అటవీ అధికారులు.

డెక్కలి మండలంలో వెంబులూరు పంచాయితీ పరిధిలో వందలాది ఎకరాల అటవీ భూమి ఉంది. తమ పంచాయితీ పరిధిలో ఉన్నందున మాకే చెందుతాయని మిట్టవడ్డెపాలెం గ్రామస్థులు, తమకే చెందుతాయంటూ సమీపంలో ఉన్న చిన్నకుప్పాయిపాలెం, పెద్దకుప్పాయిపాలెం వాసులు పోటీ పడుతున్నారు. ఈ అటవీభూముల విషయంలో ఇరు గ్రామాలకు మధ్య వివాదంపెరిగింది. 2 రోజులుగా ఆ భూములను ఆక్రమించుకునేందుకు పోటీ పడుతూ, చెట్లను నరికేస్తున్నారు. ఈ సమస్యపై డెక్కలి మండలంలోని అధికారులు.. జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్రవహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Last Updated : Feb 8, 2019, 8:16 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details