ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బడ్జెట్​లో బ్యాంకింగ్ రంగానికి పెద్దపీట వేయాలి'

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​లో బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోషియేషన్ సెక్రటరీ వీఎస్ రాంబాబు డిమాండ్ చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన బ్యాంకులకు చేయూత అందించాలని కోరారు.

By

Published : Jun 30, 2019, 7:50 PM IST

బ్యాంకర్ల సమావేశం

ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోషియేషన్ సెక్రటరీ వీఎస్ రాంబాబు

కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనంపై కాకుండా నిరర్ధక ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోషియేషన్ సెక్రటరీ వీఎస్ రాంబాబు కోరారు. నెల్లూరులో నిర్వహించిన బ్యాంకు ఉద్యోగుల సంఘం కేంద్ర కమిటీ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల్లో ఉన్న బ్యాంకులకు మూలధనం ద్వారా చేయూత అందించాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details