ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

..

By

Published : Oct 4, 2021, 9:02 PM IST

TOP NEWS
TOP NEWS

  • Drug free Universities: కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండొద్దు: సీఎం జగన్
    రాష్ట్రంలో ఎక్కడా మాదక ద్రవ్యాల సరఫరా లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో మాదక ద్రవ్యాల ఆనవాళ్లే ఉండకూడదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CHANDRABABU: 'వైకాపా నేతలు డ్రగ్స్ డాన్స్‌, స్మగ్లింగ్ కింగ్‌లుగా మారారు'
    వైకాపా ముఖ్యనేతలు డ్రగ్స్​ డాన్లు (drug don), స్మగ్లింగ్ కింగ్(smuggling king)లుగా అవతారమెత్తారని తెదేపా నేతలు(TDP leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి షెల్ కంపెనీలు సృష్టించి అవినీతికి పాల్పడటంతో పాటు అక్రమాస్తుల కేసులో సీబీఐ(CBI), ఈడీ(ED) విచారణ ఎదుర్కొంటున్నందున, అన్ని అంశాలు పరిశోధించి ప్రజలకు వాస్తవాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • APPSC: 3నెలల్లో గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు
    గ్రూప్‌ -1 మెయిన్స్ జవాబు పత్రాలను మాన్యువల్​గానే మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతారామాంజనేయులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 3నెలల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ORGANIC FARMING: రైతులకు రెట్టింపు ఆదాయం కోసం ఆర్గానిక్ ఫార్మింగ్: కన్నబాబు
    సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సాహంపై మంత్రి కన్నబాబు విజయవాడలో సమీక్ష నిర్వహించారు. ఈ విధానం వల్ల రైతులకు లాభాల పంట కురవడమే కాకుండా వినియోగదారులకు మంచి ఆరోగ్యం లభిస్తుందని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'లఖింపుర్​ హింసపై రిటైర్డ్​ జడ్జితో విచారణ- వారికి రూ.45లక్షలు పరిహారం'
    లఖింపుర్​ ఖేరి(Lakhimpur Kheri news) హింసాత్మక ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు తెలిపారు ఏడీజీ ప్రశాంత్​ కుమార్​. ప్రాణాలు కోల్పోయిన(Lakhimpur Kheri violence) నలుగురు రైతులకు రూ.45 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పాండోరా​ పేపర్స్​'పై కేంద్రం దృష్టి.. వారి లెక్కలు తేల్చే పనిలో సీబీడీటీ
    ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేసిన పాండోరా పేపర్స్ (Pandora Papers Leak) వ్యవహారంపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పత్రాల్లో ఉన్న భారతీయులకు సంబంధించిన కేసులపై విస్తృత దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపులు- 3వేల మంది నిందితులు!
    చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో విస్తుపోయే నిజాలు వెల్లడించింది స్వతంత్ర దర్యాప్తు కమిషన్​. ఫ్రాన్స్​ క్యాథలిక్​ చర్చిలో గడిచిన 70 ఏళ్లలో 3వేల మంది నేరాలకు పాల్పడినట్లు తేల్చింది. పూర్తి నివేదికను మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వరుస నష్టాలకు బుల్​ బ్రేకులు- మార్కెట్లకు భారీ లాభాలు
    స్టాక్ మార్కెట్లు (Stock Market) నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి సోమవారం కాస్త తేరుకున్నాయి. సెన్సెక్స్ (Sensex Today) 534 పాయింట్లు పెరిగి 59,300 వద్దకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 159 పాయింట్ల లాభంతో 17,700 మార్క్​కు చేరువైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​పై హిట్​మ్యాన్​ సంచలన వ్యాఖ్యలు
    ఇంగ్లాండ్​తో ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్​పై టీమ్ఇండియా బ్యాట్స్​మన్​ రోహిత్​ శర్మ(Rohit Sharma England Series) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్​ తన కెరీర్​లో ఉత్తమమైనదని వస్తున్న విశ్లేషణలపై స్పందించిన హిట్​మ్యాన్​.. తనలోని బ్యాటింగ్​ ప్రదర్శనను మరింత బయట పెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Drugs Case News: డ్రగ్స్​ కేసులో ఎన్​సీబీ కస్టడీకి ఆర్యన్​ ఖాన్​
    రేవ్‌పార్టీ(Mumbai Rave Party) కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌కు(Aryan Khan Arrest) కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details