- KRMB, GRMB MEETING: సెప్టెంబర్ 1న కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ
కేంద్ర గెజిట్పై సెప్టెంబర్ 1న కృష్ణా, గోదావరి బోర్డులు భేటీ కానున్నాయి. సెప్టెంబర్ 1న ఉదయం కృష్ణా బోర్డు సమావేశం జరగనుండగా.. సాయంత్రం 4 గంటలకు రెండు బోర్డులు సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Vijayasaireddy: విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతి
విదేశాలకు వెళ్లేందుకు ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. అక్టోబర్ లోగా 2 వారాలు విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తితిదే ఒక వ్యక్తి.. ఆ సమాచారం ఇవ్వలేం..!: ఆర్బీఐ
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రిజర్వు బ్యాంక్ ఒక వ్యక్తిగా నిర్ధరించింది. గడువు తర్వాత తితిదే హుండీలో వేసిన రూ.51 కోట్ల విలువైన పెద్ద నోట్లు, రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యలు, దీనిపై కేంద్ర ఆర్థిక శాఖతో జరిపిన సమాచారం ఇవ్వాలంటూ ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నకిలీ చలానాల వ్యవహారం... ప్రధాన నిందితుడు అరెస్టు
కృష్ణా జిల్లా మండవల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన నకిలీ చలానాల వ్యవహారంలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 450 చలానాలకు సంబంధించి... రూ.1.02కోట్లను ప్రభుత్వ ఖజానాలో జమ చేయించినట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిషీల్డ్పై రివర్స్ గేర్- డోసుల వ్యవధి తగ్గింపు!
సీరం సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ కరోనా టీకా డోసుల మధ్య వ్యవధిని తగ్గించే(Covishield dose gap) ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు చేస్తోంది. వ్యవధిని తగ్గించే విషయంపై నిపుణుల కమిటీ త్వరలో చర్చించనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అఫ్గాన్ సంక్షోభంతో భారత్కు కొత్త చిక్కులు
అఫ్గానిస్థాన్లో శరవేగంగా మారిన పరిస్థితులు (Afghanistan crisis) భారత్కు కొత్త తలనొప్పులు తెచ్చే ప్రమాదముందని (Afghanistan impact on India) నిపుణులు భావిస్తున్నారు. తాలిబన్లు కేంద్రంగా భారత వ్యతిరేక శిబిరాలన్నీ ఏకమవుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత- వారిపై టియర్ గ్యాస్ ప్రయోగం
కాబుల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాలిబన్ల పాలనలోని అఫ్గానిస్థాన్ను వీడి ఇతర దేశాలకు వెళ్లాలన్న ఆశతో భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్, జలఫిరంగులు ప్రయోగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డ్రోన్లకు కొత్త రూల్స్.. రిజిస్ట్రేషన్ మరింత ఈజీ!
వ్యాపార అనుకులంగా డ్రోన్ రూల్స్ను సవరించింది కేంద్రం. ఇందుకు సంబంధించిన 'డ్రోన్ రూల్స్ 2021'ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్- టీ టైమ్కు స్కోరు 298/3
భారత్పై ఆతిధ్య జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. టీ బ్రేక్ సమయానికి 94 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆధిక్యం 220 పరుగులుగా నమోదైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RRR: ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి.. రిలీజ్ వాయిదా!
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్గానే కాకుండా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్ని ఇస్తూ వస్తున్న మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ని అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.