ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చదువుపై ఆసక్తి లేక విద్యార్థి ఆత్మహత్య!

కర్నూలులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దిలీప్ అనే విద్యార్థి కళాశాల వసతి గృహంలో బాత్​రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువుపై ఆసక్తి లేకపోవటంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

By

Published : Aug 5, 2019, 5:09 PM IST

చదువుపై ఆసక్తి లేక విద్యార్థి ఆత్మహత్య

చదువుపై ఆసక్తి లేక విద్యార్థి ఆత్మహత్య!

కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు సమీపంలోని బీ.తాండ్రపాడు వద్దనున్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దిలీప్ అనే విద్యార్థి కళాశాల వసతి గృహంలోని బాత్​రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థులు కళాశాల యాజమన్యానికి సమాచారం ఇవ్వగా... కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతపురం జిల్లా ముదిగల్లు గ్రామానికి చెందిన దిలీప్కు తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నాన్నే చదివిస్తున్నాడు.చదువుపై ఆసక్తిలేకనే దిలీప్​ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కళాశాల వసతి గృహాన్ని తనిఖీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details