ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు.. పది రోజుల పాటు నగరంలో పాదయాత్ర చేస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హమీల్లో దాదాపు 90 శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు.
ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేసి నేటికి ముడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజు వైఎస్సార్ కూడలిలోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి యాత్ర ప్రారంభించారు.