ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 16, 2021, 11:02 AM IST

ETV Bharat / city

కడప ఆర్టీసీకి ఆదాయం ఫుల్లు.. ఖుషీ ఖుషీగా అధికారులు

కరోనా కారణంగా ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గింది. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అధికారులు పెద్ద ఎత్తున బస్సులు తిప్పడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కడప ఆర్టీసీ ఆదాయం కోటి దాటింది. అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

crore income to kadapa rtc
crore income to kadapa rtc

సుమారు ఏడాదిన్నర అనంతరం కడప జిల్లా ఆర్టీసీకి కోటి రెండు లక్షల రూపాయలు ఆదాయం రావడంతో అధికారులు ఖుషి ఖుషీగా ఉన్నారు. కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీకి మొదటిసారిగా కోటి రెండు లక్షల ఆదాయం వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో పరిధిలో రోజుకు 600 ఆర్టీసీ బస్సులు, 228 అద్దె బస్సులను తిప్పుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలతో పాటు తిరుపతి, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తదితర జిల్లాలకు కూడా బస్సులను నడుపుతున్నారు. బద్వేల్ డిపోకు రూ.9.03 లక్షలు, జమ్మలమడుగు రూ.9.02 లక్షలు, కడప 23 లక్షల 39 వేలు, మైదుకూరు రూ.6.42 లక్షలు, ప్రొద్దుటూరు రూ.17.54 లక్షలు, పులివెందుల రూ.13.61లక్షలు, రాజంపేట రూ.10.14 లక్షలు, రాయచోటి రూ.13.83 లక్షలు ఆదాయం రావడంతో అధికారులు, కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. మరింత ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామని ఆర్టీసీ ప్రాంతీయ అధికారి జితేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details