ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 23, 2020, 4:12 PM IST

ETV Bharat / city

కరోనా చికిత్స కోసం ఎయిమ్స్​లో ప్రత్యేక ఐసోలేషన్​ వార్డు

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్​లో ప్రత్యేక ఐసోలేషన్​ వార్డును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ కొవిడ్​ సేవలను మరింత విస్తృతం చేస్తామని వైద్యాధికారులు స్పష్టం చేశారు.

కరోనా చికిత్స కోసం ఎయిమ్స్​లో ప్రత్యేక ఐసోలేషన్​ వార్డు
కరోనా చికిత్స కోసం ఎయిమ్స్​లో ప్రత్యేక ఐసోలేషన్​ వార్డు

గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. మంగళగిరి ఎయిమ్స్​లో ప్రత్యేక ఐసోలేషన్​ వార్డు అందుబాటులోకి తెచ్చారు. 28 ఐసోలేషన్​ బెడ్స్​తో పాటు.. నాలుగు వెంటిలేటర్​ బెడ్స్​ను అధికారులు ఏర్పాటు చేశారు. వీటితో పాటే రోజుకు వంద మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఎయిమ్స్​కు వచ్చే రోగుల్లో కరోనా లక్షణాలుంటే ప్రత్యేక పరీక్షలు నిర్వహించిన తర్వాత అవసరమైతేనే కొవిడ్​ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్​ రాకేశ్​ కక్కర్​ చెప్పారు. అనుమానితుల నుంచి తీసిన నమూనాలు ఇక్కడే పరీక్షిస్తున్నామని తెలిపారు. త్వరలో కొవిడ్ సేవలను మరింతగా విస్తరిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details