ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 5, 2022, 9:57 AM IST

ETV Bharat / city

పల్నాడు కలెక్టర్‌ తొలిరోజే తనిఖీలు.. బాలుర గురుకుల పాఠశాలలో రాత్రి బస

Palnadu Collector: బాలుర గురుకుల పాఠశాలలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలని ఏర్పరుచుకుని కష్టపడాలని సూచించారు. విద్యార్థులతో కలసి భోజనం చేసిన కలెక్టర్‌ శివశంకర్... రాత్రి అక్కడే బస చేశారు.

Palnadu Collector
బాలుర గురుకుల పాఠశాలలో పల్నాడు జిల్లా కలెక్టర్‌

Palnadu Collector: కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో కలెక్టర్‌గా.. బాధ్యతలు చేపట్టిన శివశంకర్ తోలి రోజే బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. చిలకలూరిపేట మండలం కొత్తరాజాపేట ఏపీ గురుకుల పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని అంకిత భావంతో కష్టపడాలని సూచించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. పల్నాడును ఆధ్యాత్మికంగా.. సంస్కృతికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్‌.. రాత్రి అక్కడే నిద్రపోయారు.

ఇదీ చదవండి: CRDA New Commissioner: సీఆర్‌డీఏ కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన వివేక్​ యాదవ్​

ABOUT THE AUTHOR

...view details