ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 15, 2021, 8:49 PM IST

ETV Bharat / city

కనుమ వేడుకల్లో జనసేనాని గోపూజ

హైదరాబాద్​లోని తన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన కనుమ వేడుకల్లో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అక్కడి గోవులకు పూజలు చేసి ఆహారం అందించారు. పశుపక్ష్యాదులను పూజించే గొప్ప ధర్మం హిందూ మతంలో ఉందని కొనియాడారు. గో సంరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నారు.

pawan kalyan gopooja in hyderabad
హైదరాబాద్​లో పవన్ కల్యాణ్ గోపూజ

మనతో పాటు జీవించే పశుపక్ష్యాదులను సైతం పూజించే విధానం.. హిందూ ధర్మంలో కనిపిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్​లోని తన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన కనుమ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గోవులకు పూజలు చేసి పండ్లు, ఇతర ఆహారం వాటికి అందించారు.

పాడి పంటలకు ఉపయోగపడిన పశు సంపదను.. కనుమ రోజున ఆరాధించడం మంచి సంప్రదాయమని పవన్ తెలిపారు. గోమాతను పూజించడం, సంరక్షించడంలో తనవంతు కృషి చేస్తానన్నారు. వ్యవసాయ క్షేత్రంలోని గోవులు, ఇతర పశు సంపద, అక్కడకు వచ్చే పక్షుల సంరక్షణ చర్యలపై సిబ్బందితో మాట్లాడారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details