మనతో పాటు జీవించే పశుపక్ష్యాదులను సైతం పూజించే విధానం.. హిందూ ధర్మంలో కనిపిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్లోని తన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన కనుమ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గోవులకు పూజలు చేసి పండ్లు, ఇతర ఆహారం వాటికి అందించారు.
పాడి పంటలకు ఉపయోగపడిన పశు సంపదను.. కనుమ రోజున ఆరాధించడం మంచి సంప్రదాయమని పవన్ తెలిపారు. గోమాతను పూజించడం, సంరక్షించడంలో తనవంతు కృషి చేస్తానన్నారు. వ్యవసాయ క్షేత్రంలోని గోవులు, ఇతర పశు సంపద, అక్కడకు వచ్చే పక్షుల సంరక్షణ చర్యలపై సిబ్బందితో మాట్లాడారు.