ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 21, 2021, 3:58 PM IST

ETV Bharat / city

ఈనెల 26న భారత్‌ బంద్​ను‌ విజయవంతం చేయాలి: సీపీఐ

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26న తలపెట్టిన భారత్‌ బంద్​ను‌ విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరులో ప్రచార ర్యాలీ నిర్వహించారు.

cpi ramakrishna rally at guntur
గుంటూరులో సీపీఐ రామకృష్ణ ర్యాలీ

భారత్‌ బంద్​ను‌ విజయవంతం చేయాలి

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు ప్రజలంతా మద్దతు తెలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ప్రజా బంద్‌ను విజయవంతం చేయాలంటూ గుంటూరులో ఆయన ప్రచార ర్యాలీ నిర్వహించారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 300 మంది రైతులు చనిపోయినా కేంద్రం స్పందించడం లేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 100 ప్రభుత్వ రంగ పరిశ్రమలను కేంద్రం ప్రైవేటీకరిస్తోందని.. ఈ కారణంగా రిజర్వేషన్లు లేక వెనకబడిన వర్గాలు నష్టపోతాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details