గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. సచివాలయం వ్యవసాయ శాఖలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి రెండు రోజుల క్రితం 10 బస్సుల్లో సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలివచ్చారు. వీరిలో దాదాపు 230 మందికి మంగళగిరిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు.
ఈయన మంగళగిరి మండలం నవులూరులోని ఓ అపార్ట్మెంట్లో మరో ఐదుగురు ఉద్యోగులతో కలిసి ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఉద్యోగిని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని క్వారంటైన్కి పంపించారు.