లాక్డౌన్ కారణంగా అంతర్జాల వినియోగం పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచారం మార్పిడి కోసం అధికారులు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. చాలా మంది ఐటీ సంస్థలు సైతం తమ ఉద్యోగులతో మాట్లాడేందుకు వీటినే వినియోగిస్తున్నాయి. అయితే ఈ జూమ్ అప్లికేషన్ అంత సురక్షితం కాదని గుర్తించిన కేంద్రం.. దాన్ని వినియోగించద్దని సూచించింది. అయితే జూమ్ యాప్ లోపాలు, దాని వినియోగంతో వచ్చే నష్టాలను ప్రముఖ సైబర్ నిపుణులు నల్లమోతు శ్రీధర్ ఈటీవీ భారత్కు వివరించారు.
- కేంద్రం జూమ్ ఆప్ ఎందుకు వినియోగించవద్దని నిర్దేశించింది?
2011లో వీడియో కాన్ఫరెన్స్ కోసం జూమ్ యాప్ను తీసుకొచ్చింది. లాక్డౌన్ తర్వాత దాని వినియోగం 200 నుంచి 300 రెట్లు వరకు వినియోగం పెరిగింది. రక్షణపరంగా జూమ్ యాప్లో చాలా లొసుగులు ఉన్నాయని తాజాగా వెల్లడైంది. యాప్ ద్వారా బయటకు వెళ్లే డాటా రెండు రకాలుగా ఉంటుంది.
1. వెబ్ డాటాలో టీసీపీ, ఐపీ పాకెట్స్ ద్వారా వెళ్తాయి. వీడియో డాటా అయితే యూడీపీ పాకెట్స్ ఉంటాయి. ఇవి ఎన్క్రిప్టెడ్ ద్వారా ఉంటే పర్వాలేదు. లేని పక్షంలో... మధ్యలో ఎవరైనా హ్యాకర్స్ ఈ డాటాను దొంగలించే అవకాశముంటుంది.
2. ఫ్రీ అకౌంట్ కలిగిన వారికి చైనా సర్వర్ల ద్వారా మనకి వీడియో కాల్స్ జరుగుతున్నాయి. దీనివల్ల అక్కడి ప్రభుత్వం వీటిపై నిఘా పెట్టి మన డాటాను చోరీ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి.
- ఇలా హ్యాక్ అయిన అంశాలేమైనా మనకి బయటకు వచ్చాయా?