ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 17, 2019, 3:30 PM IST

ETV Bharat / city

'రాష్ట్రానికి 7 వైద్య కళాశాలలు మంజూరు చేయాలి'

రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై అఖిలపక్షం సమావేశంలో ప్రస్తావించినట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయని ఆరోపించిన ఆయన.. సవరించిన అంచనాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

'రాష్ట్రానికి 7 వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరాం'

రాష్ట్రానికి రావాల్సిన వాటిపై చర్చించామన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి

రాష్ట్రానికి 7 వైద్య కళాశాలలు మంజూరు చేయాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. దిల్లీలో అఖిలపక్షం సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన.. ఏపీలో రాజధాని మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రివర్స్​ టెండరింగ్​ ద్వారా ప్రజాధనం వృథా కాకుండా చేయగలిగామని అన్నారు. ప్రాజెక్టులో సవరించిన అంచనాలు ఆమోదించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై భేటీలో ప్రస్తావించినట్లు తెలిపారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని కోరినట్లు పేర్కొన్నారు. మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలను లేవనెత్తామని వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details