మానవ హక్కుల కమిటీని స్వాగతిస్తాం: అంబటి
రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు జాతీయ మానవ హక్కుల సంఘం.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయటాన్ని స్వాగతిస్తున్నట్లు వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు.
తెదేపా ఫిర్యాదు మేరకు రాష్ట్రంలో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు... మానవ హక్కుల సంఘం ప్రత్యేక కమిటీ నిమమించటాన్ని స్వాగతిస్తున్నట్లు వైకాపా తెలిపింది. మానవ హక్కుల కమిటీ రాష్ట్రంలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలియజేస్తుందని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా తెదేపా నేతలపై దాడులు జరగకపోయినా..ఉన్నది లేనట్లుగా సృష్టించి మానవ హక్కుల కమిటీ ముందు అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని...ఎక్కడా శాంతి భద్రతల సమస్య లేదన్నారు. వైకాపా కార్యకర్తలపై దాడులకు తెదేపా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.