ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌పై విజయసాయిరెడ్డి ఫిర్యాదు

విశాఖపట్నంలోని గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ అనేక నిబంధనలు ఉల్లంఘించిందని, దానిపై విచారణకు ఆదేశించాలని జాతీయ వైద్య కమిషన్‌(ఎంసీఐ)ను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.

By

Published : Oct 27, 2020, 8:32 AM IST

mp vijayasai reddy
ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖలోని గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్​లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ... వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ...జాతీయ మెడికల్ కౌన్సిల్​కు లేఖ రాశారు. వైద్య కళాశాల అనుమతి కోసం గీతం యాజమాన్యం నకిలీ పత్రాలు సమర్పించిందని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమిలో ల్యాబ్​లు, హాస్టళ్లు, సిబ్బంది నివాసాలు కట్టారని లేఖలో పేర్కొన్నారు. వాటికి ఎలాంటి అనుమతీ తీసుకోలేదన్నారు. ఆర్డీవో బృందం విచారణలో 40 ఎకరాల 51సెంట్ల సర్కారు భూమిని ఆక్రమించినట్టుగా తేలిందన్నారు. ఎంసీఐ నిబంధనలను ఎక్కడా పాటించకుండా మెడికల్ కళాశాలను నిర్మించారని విజయసాయి ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details