ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : May 11, 2021, 6:58 PM IST

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM

  • ప్రధానికి సీఎం జగన్ లేఖ

రాష్ట్రానికి ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌.. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆక్సిజన్‌ కేటాయింపులను 910 మెట్రిక్ టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కరోనా రోగి మృతదేహాన్ని నడిరోడ్డుపైనే దింపేయడం అమానుషం: చంద్రబాబు

కరోనా రోగి మృతి చెందడంతో నడిరోడ్డుపై అమానుషంగా 108 సిబ్బంది వదిలి వెళ్లడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుపట్టారు. ఈ విషయానికి సంబంధించిన వీడియోను తన ట్వీట్ కు జత చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సరిహద్దుల వద్ద అంబులెన్స్‌లు ఆపవద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశం

ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే అంబులెన్సులను సరిహద్దుల వద్ద నిలిపేసిన ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వ వివరణ ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. సర్క్యులర్‌, అడ్వైజరీ లేకుండా ఎలా నిలిపివేస్తారని నిలదీసింది. సరిహద్దుల వద్ద అంబులెన్సులు ఆపవద్దని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మామిళ్లపల్లెలో పేలుడు కేసు: ఎంపీ వైఎస్ అవినాశ్ పెదనాన్న ప్రతాప్ రెడ్డి అరెస్టు

కడప జిల్లా మామిళ్లపల్లె గనిలో పేలుడు కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రతాప్‌రెడ్డి అరెస్టు అయ్యారు. పేలుడు పదార్థాలు పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుముఖం!'

దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుముఖం పడుతుందనేందుకు ఇది సంకేతమని అభిప్రాయపడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వైన్ షాపుల వద్ద మందుబాబుల బారులు

ఉత్తర్​ప్రదేశ్​లో పలు చోట్ల మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో మందుబాబులు దుకాణాల ముందు క్యూ కట్టారు. కరోనా ఆంక్షల కారణంగా మే 3 నుంచి 10 వరకు అక్కడ మద్యం దుకాణాలు తెరవలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దేశం 'లాక్​డౌన్'- అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు!

సంపూర్ణ లాక్​డౌన్ విధించనప్పటికీ.. దాదాపు దేశమంతా ఆంక్షల బాటలోనే కొనసాగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలే లాక్​డౌన్​లు విధిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అపార్ట్​మెంట్​ను తాకిన ఇజ్రాయెల్ రాకెట్

రాకెట్ దాడులతో ఇజ్రాయెల్​ సరిహద్దు అట్టుడికిపోతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రయోగించిన ఓ రాకెట్.. గాజాలోని అపార్ట్​మెంట్​ను తాకింది. ఈ దాడుల్లో పలువురు ముష్కరులు మరణించారని పాలస్తీనా మీడియా తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బుమ్రా, చాహర్​కు కరోనా టీకా తొలి డోసు

ఇప్పటికే పలువురు టీమ్​ఇండియా ఆటగాళ్లు కరోనా టీకా తొలి డోసు తీసుకోగా.. ఇప్పుడా జాబితాలో పేసర్ బుమ్రా, దీపక్​ చాహర్​, సిద్ధార్థ్​ కౌల్​ కూడా చేరారు. ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా వ్యాక్సినేషన్​ వేయించుకోవాలని వీరు కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • లండన్​ ఇంట్లో బాలీవుడ్ సెలబ్రిటీస్​!

బాలీవుడ్​కు చెందిన పలువురు తారలకు లండన్​లోనూ సొంత గృహాలు ఉన్నాయి. షారుక్​తో పాటు పలువురు అక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేశారు. వారెవరో చూద్దాం.

ABOUT THE AUTHOR

...view details