- వైద్యం బాగుంది.. కానీ..!
ఏపీ ఉపముఖ్యమంత్రికి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కారణంతో మొదట తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొంది...ఇప్పుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఏపీ ఆస్పత్రుల్లో వైద్యం సరిగా అందడం లేదా... అంటూ విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి స్పందించి ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- యోధుల మరణంపై ఆవేదన
పోలీసులు, వైద్యులు కరోనా విధుల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అధికారులకు, వైద్యులకు జనసేన తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- త్వరలోనే విద్యా సంవత్సర క్యాలెండర్
రాష్ట్రంలో కొవిడ్ కారణంగా విద్యార్థులకు సమయం వృథా కాకుండా ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు నాడు - నేడు కార్యక్రమం కింద పాఠశాలలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- బెయిల్ పిటిషన్ వాయిదా
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'మహా' ఉద్ధృతి
మహారాష్ట్రలో కొత్తగా 8 వేల 641 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 84 వేలు దాటింది. మరో 266 మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.
- బాధితులున్న చోటికే..!