- అయ్యన్న అరెస్టుపై స్టే
తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడి అరెస్టుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇటీవల ఆయనపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది. ఆయన కోర్టును ఆశ్రయించగా..కోర్టు స్టే ఇచ్చింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- విచారణ పూర్తి
బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో పోలీసు కస్టడీలో ఉన్న జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిల విచారణ పూర్తైంది. పోలీసు విచారణను తప్పుబట్టిన ప్రభాకర్రెడ్డి.. ఈ కేసులో మిగిలిన వారిని కూడా ప్రశ్నించి తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'విధానాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు'
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రాణహాని ఉంటే..ముందు రాష్ట్ర హోంశాఖను సంప్రదించాల్సిందని..లేకపోతే సీఎం జగన్ దృష్టికి తీసుకురావాల్సిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మరిన్నివివరాలకు క్లిక్ చేయండి
- మరో గజరాజు మృతి!
కేరళలో పేలుడు పదార్థాలు తిని మరణించిన ఏనుగు తరహాలోనే తమిళనాడులో మరో గజరాజు ఆకతాయిల రాక్షసత్వానికి బలైంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- విచారణకు త్రిసభ్య ధర్మాసనం
పూరీ జగన్నాథ రథయాత్ర వ్యవహారంపై విచారణ జరిపేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
- ఉద్రిక్తతపై భారత్- చైనా చర్చలు
తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్-చైనాకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు సోమవారం సమావేశమయ్యారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- పరిగెత్తిన చైనా జవాన్లు!
గల్వాన్ ఘటనలో చైనాకు చిక్కిన భారత సైనికులు తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే ఈ పరీక్షల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అప్పటి ఘర్షణ సమయంలో భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని చూసి శత్రు దేశ సైనికులు భయపడి పారిపోయినట్లు వారు తెలిపారు. వారిని వెంబడించే క్రమంలోనే బందీలుగా చిక్కినట్లు సదరు సైనికులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- జీతాలు చెల్లించలేని స్థితిలో షిరిడీ ఆలయ ట్రస్టు
కరోనా కారణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది ప్రముఖ షిరిడీ సాయిబాబా ఆలయ ట్రస్టు. లాక్డౌన్లో భక్తులు లేక, విరాళాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జీతాల విషయంపై ట్రస్టును అడిగినా ప్రయోజనం లేకుండా పోయిందని అక్కడి ఉద్యోగి ఒకరు చెప్పారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మ్యాగ్జైన్పై కంగన ఆగ్రహం
ఓ ఫ్యాషన్ మ్యాగ్జైన్ సంస్థ, అనుమతి లేకుండా కంగన ఫొటోలు ఉపయోగిస్తోందని నటి కంగనా రనౌత్ బృందం ట్వీట్ చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'అవకాశాలు పక్కా వస్తాయి'
త్వరలో తాను కూడా టిక్టాక్లో ఎంట్రీ ఇస్తానని చెప్పాడు ఆస్ట్రేలియా ఓపెనర్ స్టీవ్ స్మిత్. వార్నర్ తన డ్యాన్స్, డైలగులతో భారత్లో చాలా క్రేజ్ సంపాదించుకున్నాడని అన్నాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి