ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @11AM

.

By

Published : Sep 19, 2020, 10:59 AM IST

Top News @ 11 AM
ప్రధాన వార్తలు @11AM

  • ప్రక్రియ ముగిసింది.. బదిలీయే మిగిలింది!

రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ ముగిసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టనున్నారు. హేతుబద్ధీకరణలో సుమారు 15 వేల మందికి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాష్ట్రవ్యాప్తంగా పొంగుతున్న వాగులు, వంకలు

రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి. వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ఎస్సీల మీద దాడులపై సీబీఐతో దర్యాప్తు చేయించండి'

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎస్సీలపై జరుగుతున్న దాడుల మీద.. సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చారిత్రక ఐరాస​ సమావేశాల్లో మోదీ కీలక ప్రసంగం

ఈసారి జరగనున్న ఐక్యరాజ్య సమితి 75వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని మోదీ రెండు ఉన్నతస్థాయి చర్చల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఒక్కరోజులో 93,337 కరోనా కేసులు, 1247 మరణాలు

భారత్​లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 93,337 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1,247 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎన్​ఐఏ తనిఖీలు: అల్​ఖైదాకు చెందిన 9 మంది అరెస్ట్

అల్​ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా కార్యకలాపాలు సాగిస్తోన్న 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బంగాల్​, కేరళలో జరిపిన సోదాల్లో వీరు పట్టుబడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పక్షవాత స్కాన్లతో కరోనాను గుర్తించొచ్చు!

కరోనా గుర్తించేందుకు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు బ్రిటన్​ శాస్త్రవేత్తలు. పక్షవాతాన్ని గుర్తించేందుకు వాడే స్కాన్లతో కరోనాను కనిపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో మెదడుకు గాయమైనట్లు అనుమానమున్న వారిలో కొవిడ్ బాధితులను త్వరగా గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 2021 ఏప్రిల్ నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్

2021 ఏప్రిల్ నాటికి అమెరికా ప్రజలందరికీ కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయని వాటిని ఆమోదించిన వెంటనే టీకాను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఐపీఎల్2020: నెట్టింట ధోనీ అభిమానుల సందడి

చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య పోరుతో నేడు ఐపీఎల్​ మొదలవనుంది. చాలా కాలం తర్వాత ధోనీ రాకతో అతడి అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నెలకొంది. ఈ సందర్భంగా ట్విట్టర్​ వేదికగా 'ధోనీ ఈజ్ బ్యాక్' అనే​ హ్యాష్ ​ట్యాగ్​ ట్రెండింగ్​లో నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వచ్చే ఏడాది దీపావళికి 'పొన్నియన్ సెల్వన్'!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details