ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @ 1PM

.

By

Published : Jul 10, 2020, 1:00 PM IST

top news
top news

  • కేంద్ర ఆర్థికమంత్రిని కలిసిన మంత్రి బుగ్గన
    దిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ‌రెడ్డి బృందం కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఈ బృందం కేంద్ర ఆర్థికమంత్రితో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రంగులు ఖరారు
    ప్రభుత్వ పాఠశాలలకు వేసే రంగులను ముఖ్యమంత్రి జగన్‌ ఖరారు చేశారు. ‘నాడు-నేడు’ కింద చేపడుతున్న పనుల్లో భాగంగా పాఠశాలలకు వేయాల్సిన రంగులను నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అమానవీయం
    సంస్కారాలు లేకుండానే కరోనా మృతదేహాలను ఖననం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కరోనాతో మరణించిన ముగ్గురిని అధికారులు అర్థరాత్రి ఖననం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జేసీబీతో పెద్ద గోతులు తీసి, రసాయనాలతో ఖననం చేస్తున్న వీడియో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • బ్యాంకుల వ్యవహారం కేసు సీబీఐకి అప్పగింత
    తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకులను బురిడీ కొట్టించి... కొన్ని కోట్ల రూపాయల రుణం పొందిన వ్యవహారంలో నమోదైన కేసులను సీబీఐ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసుకు సంబంధించి బ్యాంకుల యాజమాన్యాలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండడం వల్ల కేసును సీబీఐకి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • సంతకానికి శానిటైజర్
    అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) పరీక్షలు రాసే విద్యార్థులు హాజరుపత్రంలో సంతకం చేసే ముందు, తర్వాత తప్పనిసరిగా చేతులను శానిటైజ్‌ చేసుకునేలా చూడాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) సూచించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • దేశానికి సౌర వెలుగులు
    మధ్యప్రదేశ్​ రేవాలో ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ పార్కును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అనంతరం ప్రాజెక్ట్​ను జాతికి అంకితం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'ఆర్థిక వృద్ధి' ఆశల మొలకలు అప్పుడేనా?
    భారత్​- చైనా దేశాల సరిహద్దు ఘర్షణలు అందరి దృష్టిని మరల్చి.. దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలోకి నెడుతున్నాయి. తొలుత భారత జీడీపీ వృద్ధి చెందుతుందని అంచనా వేసింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోవడం వల్ల సుమారు 4.5 శాతం పతనమౌతుందని హెచ్చరికలు జారీచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • సౌర విద్యుత్ వేలంలో భారత్ భేష్​: గుటెరస్​
    2020లో వృద్ధి చెందగల ఏకైక ఇంధన వనరు.. పునరుత్పాదక శక్తేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. సంప్రదాయ శిలాజ ఇంధనాల వనరుల కంటే ఇవి మూడు రెట్లు ఎక్కువగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అండర్సన్ మాయ చేస్తాడు​: సచిన్​
    రివర్స్​ స్వింగ్​లో ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​ ఉత్తమ బౌలర్​ అని అభిప్రాయపడ్డాడు క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందూల్కర్.​ ఇటీవలే ట్విట్టర్ వేదికగా మాట్లాడిన లిటిల్​ మాస్టర్​ అనేక విషయాలు పంచుకున్నాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • బయో ఎంజైమ్స్​ తయారు చేసిన సమంత
    అక్కినేని కోడలు సమంత ఈ లాక్​డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. యోగా నేర్చుకుంటూ, మిద్దెపై వ్యవసాయమూ చేస్తోంది. తాజాగా బయో ఎంజైమ్స్​ తయారీని నేర్చుకుంటున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details