1. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెల్లడి
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 2018 నోటిఫికేషన్కు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. కమిషన్ అధికారిక వెబ్సైట్(www.psc.ap.gov.in)లో అభ్యర్థుల వివరాలను పేర్కొన్నారు. జూన్ 14 నుంచి ఇంటర్వూలు నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
2. ముఖ్యమంత్రి జగన్కు సీబీఐ కోర్టు నోటీసులు.. మే 7న విచారణ
ముఖ్యమంత్రి జగన్కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్పై నోటీసులు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా కొనసాగుతూ బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని రఘురామ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు వివరణ ఇవ్వాలని సీఎం జగన్కు, సీబీఐకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు నోటీసులు పంపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. విజయవాడలో భారీ చోరీ.. 7 కేజీల బంగారం అపహరణ
విజయవాడలో ఓ బంగారు దుకాణం యజమాని ఇంటి వద్ద ఉంచిన బంగారం సుమార 7 కిలోలు చోరీకి గురైంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రాష్ట్రంలో కరోనా కల్లోలం.. కొత్తగా 14,669 కేసులు, 71 మరణాలు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరసబారిన పడుతోన్న బాధితులతో పాటు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,748 పరీక్షలు నిర్వహించగా.. 14,669 కేసులు నిర్ధారణ కాగా.. 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,69,544 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'టీకాల వల్ల కలిగే దుష్ప్రభావాలు స్వల్పమే'
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ కొందరిలో టీకాపై భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా టీకాల వల్ల కలిగే దుష్ప్రభావాలు స్వల్పమేనని బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న నలుగురిలో ఒకరికి మాత్రమే దుష్ప్రభావాలు కనిపిస్తుండగా.. అవి ఒకటి లేదా రెండు రోజుల్లోనే తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.