- కోలుకున్నాక నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటాం: డీసీపీ
విశాఖలో యువతిపై దాడి ఘటనలో దర్యాప్తు జరుగుతోందని డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ఆస్పత్రిలో కోలుకున్నాక నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మరో పాల విప్లవం మొదలవుతుంది
రాష్ట్రవ్యాప్తంగా పాలసేకరణకు సంబంధించి ఏపీ - అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ సచివాలయంలో ప్రారంభించారు. తొలివిడతలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పాలసేకరణను సీఎం జగన్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవిష్కరించారు. అమూల్ రాకతో ఏపీలో మరోమారు పాల విప్లవం మొదలైందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'మా సంస్థలో 36 లక్షల మంది రైతులే యజమానులు'
అమూల్ రాక ఎవరికీ పోటీకాదని.. ఆ సంస్థ ఎండీ సోధి స్పష్టం చేశారు. రైతులు, వినియోగదారులకు మేలు జరగనుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ త్వరలో రెండో అమూల్గా మారుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా పాలసేకరణ మంచి నిర్ణయమని కొనియాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన..
అన్నం పెట్టే రైతన్న కన్నీరు కార్చే పరిస్థితి ఏర్పడిందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నివర్ తుపానుతో నష్టపోయిన.. కృష్ణా జిల్లా రైతులను ఆయన పరామర్శించారు. దెబ్బతిన్న పంటలను పవన్ స్వయంగా పరిశీలించారు. ఆ పర్యటనకు సంబంధించి డ్రోన్ వీడియో చూడండి.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'పారిస్ ఒప్పందం' అమలుపై అపెక్స్ కమిటీ
పారిస్ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి నేతృత్వంలో అంతర్ మంత్రిత్వ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మహిళతో అసభ్య ప్రవర్తన- అడ్డొచ్చిన వ్యక్తిపై కాల్పులు