ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

.

By

Published : Jul 4, 2020, 12:59 PM IST

top news 1pm
ప్రధాన వార్తలు @ 1PM

  • రాజధానుల పేరుతో మూడు ముక్కలాట
    అమరావతి పోరాటానికి అల్లూరి ఆదర్శమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 200 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి అభినందనలు తెలిపారు. రాజధాని తరలించేందుకు వైకాపా అబద్ధపు కారణాలన్నీ చెప్పిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు నిర్మిస్తారా అని ప్రశ్నించారు. ప్రాచీన చరిత్ర కలిగిన అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా మార్చాలనుకున్నామని చంద్రబాబు అన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ప్రభుత్వ నిర్ణయం అన్యాయం
    రాజధాని అమరావతిపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. రాజధానిపై వైకాపా పునరాలోచించాలని రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతిలో 80 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • మండలి అత్యవసర సమావేశం
    తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతనన తిరుమలలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా దర్శనాలపై సమీక్ష నిర్వహించినట్లు తితిదే చైర్మన్​ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తుల సంఖ్య పెంచకుండా ఇదే పరిస్థితి కొనసాగిస్తామన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • మాజీ మంత్రికి కరోనా
    భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్​గా నిర్దరణ అయ్యింది. తన స్నేహితుని ద్వారా తనకు కరోనా సోకిందని.. స్వయానా ఆయనే వీడియో విడుదల చేశారు. వైరస్​ సోకితే భయపడవలసిన అవసరం లేదని.. భౌతిక దూరం, మాస్కులు ధరించాలని సూచించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • మూగజీవి మౌనరోదన
    ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో దారుణం జరిగింది. అడవి పందుల కోసం పెట్టిన బాంబు నోట్లో పేలటం వల్ల ఓ ఎద్దు తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న అధికారులు ఆ మూగజీవికి చికిత్స అందించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • లద్దాఖీల మాట వినండి
    దేశ భక్తులైన లద్దాఖ్ ప్రజలు, చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారన్నారు రాహుల్​ గాంధీ. వారి హెచ్చరికలను ప్రభుత్వం విస్మరిస్తే అది దేశానికే ప్రమాదం తెచ్చిపెడుతుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మోదీ సర్కార్​పై విరుచుకుపడ్డారు. చైనా చొరబాట్లపై లద్దాఖీ ప్రజలు చేసిన హెచ్చరికల పట్ల మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని పరోక్ష విమర్శలు చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 7,500 ఉద్యోగాల కోత
    ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్​ ఫ్రాన్స్​ దాని అనుబంధ సంస్థ హాప్​లు భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమయ్యాయి. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ఈ సంస్థలు 2022 నాటికి సంయుక్తంగా 7,500 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు ప్రకటించాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • భేటీ సోమవారానికి వాయిదా
    అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం సోమవారానికి వాయిదా పడింది. ప్రధాని కేపీ శర్మ ఓలి భవితవ్యంపై చర్చించేందుకు భేటీని తొలుత శనివారం నిర్వహించాలని భావించారు. అయితే ముఖ్య నేతల కోరిక మేరకు తేదీ మార్చారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • అలా ప్రేమలో పడ్డారు
    మైదానంలో ప్రశాంతమైన ఆటతీరుతో టీమ్​ఇండియాకు ఎన్నో విజయాలనందించాడు మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ. అయితే అతడి జీవితంలో క్రికెట్​కు మించిన ఓ ఆసక్తికరమైన ప్రేమకథ కూడా ఉంది. ఆ ప్రేమకథే ధోనీ, సాక్షి మూడు ముళ్ల బంధానికి దారీ తీసింది. నేడు వీరిద్దరి పెళ్లిరోజు సందర్భంగా వారి లవ్​స్టోరీపై ఓ లుక్కేద్దాం.
  • గల్వాన్ ​ఘటనపై సినిమా
    గల్వాన్​ ఘర్షణ నేపథ్యంలో బాలీవుడ్​లో ఓ సినిమా తెరకెక్కనుంది. స్టార్​ హీరో అజయ్​ దేవగణ్​ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జూన్​ 15న తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్ లోయ వద్ద భారత్​-చైనా బలగాల మధ్య చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత వీరులు అమరులైన ఘటన యావత్తు దేశాన్ని కలిచివేసింది. అయితే తాజాగా ఇదే కథాంశం నేపథ్యంలో త్వరలోనే బాలీవుడ్​లో సినిమా తెరకెక్కనుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details