ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బేడ, బుడగ జంగాలకు ప్రభుత్వం శుభవార్త

రాష్ట్రంలోని పలు కులాల సర్టిఫికెట్ల వివాదాలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జేసీ శర్మకు ఈ కమిషన్‌ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

By

Published : Sep 5, 2019, 6:43 PM IST

ఏపీ లోగో

రాష్ట్ర ప్రభుత్వం బేడ, బుడగ జంగాలను ఎస్టీల్లో చేర్చే అంశంపై ఏక సభ్య కమిషన్​ను నియమించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి జేసీ శర్మ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని బెంతో, ఒరియా కులాలకు ఎస్టీ సర్టిఫికెట్‌ జారీ అంశాన్నీ పరిశీలించనుంది. కమిషన్ ఏర్పాటుతో పాటు విధివిధానాలు ఖరారు చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details