ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 20, 2020, 5:08 AM IST

Updated : Jan 20, 2020, 6:08 AM IST

ETV Bharat / city

ఒకే రాష్ట్రం- ఒకటే రాజధాని..అది 'అమరావతే'

రాజధాని తరలింపుపై ప్రభుత్వం బిల్లు ఏ రూపంలో తెచ్చినా... ఉభయసభల్లో తిప్పికొట్టాలని తెలుగుదేశం శాసనసభాపక్షం నిర్ణయించింది. 'ఒకే రాష్ట్రం ఒకే రాజధాని' వాదనకు కట్టుబడి ఉండాలని ప్రధాన ప్రతిపక్షం తేల్చి చెప్పింది. అభివృద్ధి వికేంద్రీకరణకు సానుకూలత ప్రకటిస్తూనే... అధికార వికేంద్రీకరణతో నష్టాలపై గళం విప్పేందుకు సిద్ధమైంది.

telugudesham-party-raise-one-state-one-capital-slogan
telugudesham-party-raise-one-state-one-capital-slogan


ఇవాళ్టి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ.... రాజధాని అంశంపై గళం విప్పేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సిద్ధమైంది. పార్టీ శాసనసభాపక్షం సమావేశంలో... చట్టసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఆధ్వర్యంలో నేతలు చర్చించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామనే విషయాన్ని.... స్పష్టం చేయాలని సంకల్పించారు.

ఒకే రాష్ట్రం- ఒకటే రాజధాని..అది 'అమరావతే'

వ్యూహ-ప్రతివ్యూహాలు..
రాజధాని మార్పు బిల్లును ఏ రూపంలోనైనా ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుని... మండలికి పంపాలన్నది ప్రభుత్వ ఉద్దేశమై ఉంటుందన్న భావనకు తెలుగుదేశం వచ్చింది. అక్కడ వీగిపోతే 22న వైకాపా సభ్యులు ఎక్కువగా ఉన్న సెలెక్ట్‌ కమిటీ ద్వారా ఆమోదముద్ర వేయించుకోవచ్చనే మార్గమూ ఉందని అనుమానిస్తున్నారు. ఆ ప్రయత్నాలను ఛేదించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించిన నేతలు... ప్రజాగ్రహం ముందు ఏ బిల్లూ నిలవదని వ్యాఖ్యానించారు.

కీలక అంశాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ చర్చించకుండా... రాష్ట్ర భవిష్యత్తును ఇద్దరు ముగ్గురు నిర్ణయిస్తున్నారని తెలుగుదేశం ఆరోపించింది. రాజధానిని మార్చే ఉద్దేశమే లేకుంటే... 34 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేదని శాసనసభలో తెలుగుదేశం ప్రశ్నించనుంది.


ఇదీ చదవండి : 'రాజధాని మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా రెఫరెండం నిర్వహించాలి'

Last Updated : Jan 20, 2020, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details