ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 22, 2020, 7:36 PM IST

ETV Bharat / city

'కరోనా బారిన పడిన కుటుంబాలకు తెదేపా అండగా ఉంటుంది'

ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించని కారణంగా జబ్బుల బారిన పడుతున్నారని తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. ఈనెల 27 వరకు 6రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో వైరస్ పై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని ఆయన తెలిపారు,

devineni umamaheshwar rao
'కరోనా బారిన పడిన కుటుంబాలకు తెదేపా అండగా ఉంటుంది'

కరోనా బారిన పడిన కుటుంబాలకు తెదేపా అండగా ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైరస్ కట్టడిపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని ఉమా తెలిపారు. ఈనెల 27 వరకు 6 రోజులపాటు కొవిడ్ నివారణపై చైతన్యం కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మద్యం దుకాణాల వద్ద కరోనా నిబంధనలు పాటించట్లేదన్నారు. దీని వల్ల వైరస్ ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈనెల 24న నిపుణులతో వర్చువల్‌ కాన్ఫరెన్సులో మాట్లాడుతామన్నారు.

ఇవీ చూడండి-రాజ్యాంగ గౌరవం, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details