ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జగన్​తో బెయిల్​ రద్దు కోరుతూ లేఖ రాయించగలరా?'

By

Published : Dec 24, 2020, 10:47 AM IST

బెయిల్ రద్దు కోరుతూ సీఎం జగన్​తో న్యాయస్థానానికి లేఖ రాయించే ధైర్యం ఉందా అని వైకాపా నేత జోగి రమేశ్​ను తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. రాయపాటి సాంబశివరావు ఇంట్లో జరిగిన సోదాలపై చంద్రబాబు స్పందించాలన్న రమేశ్​ వ్యాఖ్యలకు ఆయన స్పందించారు.

ashoke fires on ramesh
' జగన్​తో బెయిల్​ రద్దు కోరుతూ లేఖ రాయించగలరా?'

రాయపాటి సాంబశివరావు ఇంట్లో జరిగిన సోదాలపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించాలన్న వైకాపా నేత జోగి రమేశ్​ వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్సీ అశోక్​ బాబు స్పందించారు. బెయిల్ రద్దు కోరుతూ జగన్​తో న్యాయస్థానానికి లేఖ రాయించే ధైర్యం ఉందా అని వైకాపా నేత జోగి రమేశ్​ను ప్రశ్నించారు. ఏ1 జగన్మోహన్ రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి అవినీతి సంపాదనలో జోగిరమేశ్, ఇతర వైకాపా నేతలకూ వాటా ఉందా అని నిలదీశారు.

అవినీతి కేసుల విచారణ 6 నెలల్లో పూర్తి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టుకు జగన్మోహన్ రెడ్డితో లేఖ రాయించగలరా అని సవాల్ చేశారు. జోగి రమేశ్ ఆ పని చేయిస్తే... తామూ చంద్రబాబుతో సీబీఐకి లేఖ రాయిస్తామని స్పష్టం చేశారు. తమ సవాల్ కు వైకాపా నేతలు సిద్ధమైతే అధికారపార్టీ సవాల్ కు తామూ సిద్ధమేనని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details